Skip to main content

బంగారు బాట

 బంగారు బాట

 (వోటర్లకు దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శనం)


గెలుస్తానని 

గాలి వ్యాపింపజేసినవాడి

వెంటబడి పోవద్దు. 

ఎవరు గెలవాలని 

నీవు ఎంచుకొన్నావో, 

అతనికి అన్ని విధాలా సహాయమందించి,

అతడు గెలిచేలా చూడు.

అప్పుడు అది

నీ గెలుపు అవుతుంది. 


గెలుస్తున్నాడని 

గాలి వ్యాపింపజేసిన వాని వెనుక 

మందలో గొఱ్ఱెలా నడిచినట్లయితే, 

ఆ క్షణాన్నే నీవు ఓడిపోయావు, 

వోట్ల లెక్కింపు అనంతర ఫలితంతో 

సంబంధం లేదు.


సిద్ధాంత నిబద్ధత, 

కార్యప్రణాళిక లేని పార్టీ లు

చాలా చేటు తెస్తాయి. 

అటువంటి పార్టీలు నిలబెట్టిన

మంచి వ్యక్తులు ఎన్నికైనా, 

వారు చేయగలిగింది తక్కువ. 


కాబట్టి వోటు వేసే ముందు 

ఇది నిర్ధారించుకో:  

నీవు 

ఒక వ్యక్తికి వోటు వేయటం లేదు.

ఒక పార్టీకి వేస్తున్నావు. 

పార్టీకి వేయటమంటే, 

అందమైన గుర్తునుచూసి 

వోటు వేయటం కాదు, 

ఒక స్పష్టతగల్గిన సిద్ధాంతానికి, 

నిర్దిష్టమైన కార్య ప్రణాళికకూ

 వోటువేస్తున్నావు. 


ఎట్టి పరిస్థితుల్లోనూ  

పైసలకు కక్కుర్తిపడి 

నీవోటును 

వృధా చేసుకోవటం లేదని 

నిర్ధారించుకో!

Comments

Popular posts from this blog

అనుచిత వ్యాఖ్యలు తగవు!

  అనుచిత వ్యాఖ్యలు తగవు! ఈరోజు దేశంలో ఏ పౌరుడిని పలకరించినా వారి నోటి నుంచి వచ్చే మాట పహల్గాం ఉగ్రదాడికి భారతదేశం ఇచ్చే జవాబు ఏమిటి? మనం ఏవిధంగా బదులు తీర్చుకోబోతున్నాం అని. దీనికి అనుగుణంగానే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక త్రివిధ దళాలు తమ కార్యాచరణ తాము చేస్తున్నాయి. భారతదేశ పౌరులుగా పూర్తి విశ్వాసముతో ఓపికగా ఎదురు చూడవలసిన సమయం ఇది. ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ఏమరుపాటుతో కూడా  అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రధాని పట్ల, త్రివిధ దళాల పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది.  సామజిక సేవలో (రాజకీయ, స్వచ్చంద సంస్థలు) ఉన్న చాలా మంది కూడా నేడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దేశం మరియు ప్రధాని పట్ల వ్యతిరేకమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఈ వ్యతిరేక వార్తలు కూడా ఒక వ్యూహంతో ప్రజలను అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే చెప్పవచ్చు. మరేమిటి ఆ అసలు సమస్య.? ఒకసారి కొన్ని ఘటనలను గుర్తు చేసుకుందాం..! బెంగళూరులో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని అవమానిస్తే స్థానిక...

నాయకుడు

  క్రీ.పూ. 327 సంవత్సరం లో అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని జయించాలి అనే ఒక కాంక్ష తో వివిధ దేశాలను జయిస్తూ భారతదేశం కూడా జయించాలి అనే ఆలోచన తో ఈ దేశం పైకి అడుగిడి ఇక్కడి స్వార్థపరులైన కొందరు రాజులని మచ్చిక చేసుకుని మరికొందరు వీరులైన రాజులని, భారతదేశ సైనికులని ముందునిలపెట్టి యుద్ధం చేయించి గెలిచి తన ఆధీనంలోకి తీసుకుని అలా ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ ఇక తనకు భారతదేశాన్ని జయించడం నల్లేరుపైన నడకే అని భ్రమిస్తూ ఉన్న సమయం లో....  అది తక్షశిలా విశ్వవిద్యాలయం. ఆ రోజుల్లో ప్రతి రాజ్యం లో మంత్రులుగా ఇక్కడ విద్యను అభ్యసించిన వారే ఉండేవారు. వీరంతా దేశము పైన ఎంతో అభిమానం కలిగి ఉండేవారు. కానీ స్వార్థపరులైన రాజుల ఆలోచనలకి ఏమిచేయలేక నిశ్చేస్తులై ఉండేవారు.  ఆ సమయంలో ఒక వ్యక్తి యావత్ భారతదేశాన్ని ఒక్కత్రాటి పైకి తీసుకుని వచ్చేవరకు నా సిగని ముడి వేయను అని ప్రతిజ్ఞభూని చంద్రగుప్తుని చేరదీసి అన్ని విద్యలూ నేర్పించి యాతని ద్వారా యావత్ భారతదేశాన్ని ఒక్కటి చేసి అలెగ్జాండర్ కలలను నిర్వీర్యం చేసిన మహా ఘనుడు, ఆచార్య విష్ణుగుప్తుడు అతనే మన చాణక్యుడు. అదే విధముగా ఒక్కసారి 16వ శతాబ్దానికి కనుక వెళ్లినట్...

గాలి మేడలు

         నేను సివిల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ..బోలెడన్ని కలలు కనేవాడిని. నా టాలెంట్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని...లక్ష జీతం...బంగ్లా...కారు ఇస్తారు అన్నవి ఆ కలలు.         అయితే డిగ్రీ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వాస్తవాలు తెలియడం మొదలు అయింది.       ఎక్కడికి వెళ్ళినా పది..పన్నెండు వేలు జీతం ఇస్తామన్న వారేగాని..నా టాలెంట్ కి తగ్గ జీతం ఇచ్చే వాళ్లు తారసపడలేదు.       కూలీ పనులు చేసేవారికి కూడా రోజుకు కనీసం అయిదు వందలు ఇస్తున్నారు.అంటే నెలకు పదిహేను వేలు.అటువంటిది ఒక ఇంజినీర్ కి పది వేల జీతం నాకు అవమానకరంగా అనిపించింది.        అందుకే కనీసం యాభై వేలు ఇవ్వనిదే ఉద్యోగంలో చేర రాదని నిర్ణయం తీసుకున్నాను.         అలా రెండేళ్లుగడిచిపోయాయి.ఇప్పుడు ఇంటర్ వ్యూ కి వెళ్తే రెండేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నావని అడుగుతూ రిజెక్ట్ చేయసాగారు.           ఇప్పుడు నేను పాతిక వేల జీతానికి సిద్ధపడ్డాను. అయితే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు కూడా గగనమయ్యారు. ...