క్రీ.పూ. 327 సంవత్సరం లో అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని జయించాలి అనే ఒక కాంక్ష తో వివిధ దేశాలను జయిస్తూ భారతదేశం కూడా జయించాలి అనే ఆలోచన తో ఈ దేశం పైకి అడుగిడి ఇక్కడి స్వార్థపరులైన కొందరు రాజులని మచ్చిక చేసుకుని మరికొందరు వీరులైన రాజులని, భారతదేశ సైనికులని ముందునిలపెట్టి యుద్ధం చేయించి గెలిచి తన ఆధీనంలోకి తీసుకుని అలా ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ ఇక తనకు భారతదేశాన్ని జయించడం నల్లేరుపైన నడకే అని భ్రమిస్తూ ఉన్న సమయం లో....
అది తక్షశిలా విశ్వవిద్యాలయం. ఆ రోజుల్లో ప్రతి రాజ్యం లో మంత్రులుగా ఇక్కడ విద్యను అభ్యసించిన వారే ఉండేవారు. వీరంతా దేశము పైన ఎంతో అభిమానం కలిగి ఉండేవారు. కానీ స్వార్థపరులైన రాజుల ఆలోచనలకి ఏమిచేయలేక నిశ్చేస్తులై ఉండేవారు.
ఆ సమయంలో ఒక వ్యక్తి యావత్ భారతదేశాన్ని ఒక్కత్రాటి పైకి తీసుకుని వచ్చేవరకు నా సిగని ముడి వేయను అని ప్రతిజ్ఞభూని చంద్రగుప్తుని చేరదీసి అన్ని విద్యలూ నేర్పించి యాతని ద్వారా యావత్ భారతదేశాన్ని ఒక్కటి చేసి అలెగ్జాండర్ కలలను నిర్వీర్యం చేసిన మహా ఘనుడు, ఆచార్య విష్ణుగుప్తుడు అతనే మన చాణక్యుడు.
అదే విధముగా ఒక్కసారి 16వ శతాబ్దానికి కనుక వెళ్లినట్లు అయితే అక్కడ కూడా యావత్ భారతదేశాన్ని తమ గుప్పిటిలో పెట్టుకోవాలి అని తహతహలాడుతున్న మొఘలులు వారికి తోడుగా స్వార్ధ చింతన అధికారవ్యామోహముతో మాతృభూమికీ వెన్నుపోటు పొడిచే రాజ్యాహంకార రాజులు ఇలా ఎవరికివారై ఉన్న ఆ రోజుల్లో....
సాక్షాత్తు భగవాన్ శ్రీ కృష్ణుల వారు చెప్పినట్లు ఎప్పుడెప్పుడు అయితే ధర్మము ఆపదలోపడుతుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అన్నట్లుగానే మళ్ళీ ఒక నాయకుడు వచ్చాడు.
చిన్నతనంలో తల్లి ఒక దుర్గాన్ని జయించు అని చెబితే వెంటనే జయించి ఇచ్చిన వీరుడు. తదనంతర కాలంలో ఈ యావత్ భారతదేశాన్ని ఒక్కటిగా చూడాలి అనే సంకల్పం తో మొఘలులని అందరిని ఒక్కడే తన గొరిల్లా యుద్ధ నైపున్యములతో వీర సింహమువలె విరుచుకుపడి భారతదేశంలో మళ్ళీ హిందూసామ్రాజ్యాన్ని స్థాపించి తృణప్రాయముగా తన గురువు అయిన సమర్ధ రామదాసులకి పాదాంకితం చేసిన మహోన్నతుడు. అటుపిమ్మట ఆ గురువు ఆజ్ఞ మేరకు యావత్ హిందూ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతే మన శివాజీ మహారాజ్.
మరల ఒక్కసారి 19వ శతాబ్దము లోకి మనము వెళ్లినట్లు అయితే యావత్ ప్రపంచము మా మతము గొప్పది అంటే మా మతము గొప్పది అని చాటుతున్న వేళ నా ఈ భారతదేశము నుండి శ్రీ రామకృష్ణ పరమహంసల ప్రియ శిష్యుడు నరేంద్రుడు అనే ఒక సాధువు ప్రపంచ మహాసభలలో ఉపన్యసించడానికి వెళ్లి, తన అవకాశము రాగానే నిర్భయముగా అప్పటివరకు ఎవ్వరు సంబోదించని మరియు వారెవ్వరూ మునుపెన్నడూ విననటువంటి పదజాలము, "నా ప్రియాతిప్రియమైన సోదర సోదరీమణులారా" అని అనగానే సభ అంతా రెండు నిమిషాలపాటు కరతాళ ధ్వనులతో మారుమ్రోగుతుంటే వివేకానందులు ఆశ్చర్యచకితులైనారు. ఎందుకంటే పాశ్చాత్య ధోరణిలో ప్రసంగాన్ని ప్రారంభించేప్పుడు మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అనడం అలవాటు.
వివేకానందుడు ప్రసంగిస్తూ నా హిందూధర్మము మాత్రమే యావత్ ప్రపంచము ఒక వసుదైక కుటుంబము అని, సర్వమానవాళి శాంతి సౌబ్రాతృత్వాన్ని కోరుకునేది అని ఉటంకిస్తూ, నా హిందూధర్మము ఒక మాహాసముద్రము లాంటింది, ఎలాగైతే చిన్న చిన్న నదులు వివిధ మార్గాలల్లో ప్రయాణించి చివరకు వచ్చి మహాసముద్రములో చేరుతాయో ఈ వివిధ మతాలన్నీ అలా చివరకు నా హిందూధర్మము తో ఏకీభావం తెలుపాల్సినదే, అని తన ఉపన్యాసాన్ని ముగించి ఆ తర్వాత వివిధ దేశాలకు వెళ్లి హిందూధర్మము యొక్క ఔనత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటిన మాహా ఘనుడు స్వామీ వివేకానందుడు.
ఇలా నా భారతదేశం ఎప్పుడు ఆపదలో చిక్కుకున్న అప్పుడు ఒక గురువు మార్గదర్శనములో నాయకుడు ముందు ఉండి నా భారతదేశాన్ని విజయతీరాలకు చేర్చాడు.
మరి నేటి పరిస్థులల్లో కూడా అలాంటి వారు ఉన్నారా అని మనము ఆలోచిస్తే
ఒక్క సారి నేటి పరిస్థితులను కనుక చూచినట్లు అయితే కరోనా అనే ఒక మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది, నా భారతదేశములో కూడా ఆ మహమ్మారి మమ్ములని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కానీ నా దేశ ప్రజలు ఎవ్వరు భయపడకుండా ధైర్యముగా ఈ మహమ్మారిని ఎదురుకునేందుకు మా ముందు ఒక నాయకుడు నిలబడ్డాడు. కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకి తన ఆపన్న హస్తం అందిస్తూ అందరిని ఈ మహమ్మారి నుండి బయటపడవేసే ప్రయత్నం చేస్తున్నాడు అతనే శ్రీ నరేందర దామోదర దాస్ మోడీ. 130కోట్ల భారతీయుల్ని కరతాళ ధ్వనులతో, దీపకాంతులతో ఏకం చేసిన ఘనత మా నాయకుడిది.
ఏ విధముగా అయితే చంద్రగుప్తుడికి చాణక్యుడు ఎలానో, శివాజీ కి సమర్థరామదాసు ఎలానో అలా మన మోడీ కి ఎవరు ఉన్నారు?
మరి నా నాయకుడి గురువు ఎవరు అతనికి ఈ స్ఫూర్తిని అందిస్తున్నది ఎవరు అని ఆలోచించినట్లు అయితే
అది మొదటి ప్రపంచయుద్ధము పూర్తిఅయి ఆంగ్లేయులు విజయగర్వం తో ఉన్న సమయం, నా భారతదేశములో స్వాతంత్య్ర ఉద్యమాలు హోరుగా జరుగుతున్న సమయము. ప్రజలని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేందుకు స్ఫూర్తిని ఇచ్చే వారందరిని ఆంగ్లేయులు అరెస్టు చేయనారంభించారు.
అలా ఆనాటి కాంగ్రెస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నటువంటి ఒక నాయకుడిని కూడా బంధించి చెరసాలలో పెట్టిన ఆంగ్లేయులకు ఆనాడు తెలియలేదు అది ఎంత పెద్దతప్పో.
అలా అరెస్టు అయి చెరసాలలో ఉన్న వ్యక్తికి వచ్చిన ఒకే ఒక్క ప్రశ్న తన తదనంతర జీవితాన్ని మార్చేసింది, ఒక సంఘటనా శక్తికి జీవం పోసింది.
అస్సలు ఏమిటి ఆ ప్రశ్న?? ఏమిటి ఆ సంఘటనా శక్తి?? ఎవరా నాయకుడు?? ఎవరు నేటి మన మోడీ కి స్ఫూర్తి ప్రధాత?
ఆ ప్రశ్నే ఇన్ని పోరాటాలు ఎందుకు వృధాగా పోతున్నాయి? నా భారతదేశము బానిసత్వము లోనికి ఎందుకు వెళ్ళింది? నా భారతదేశము స్వాతంత్య్రము ఎందుకు కోల్పోయింది?
ఆ కారాగారములో ఒక రోజు అంతా నిద్ర పోనీకుండా ఆ వ్యక్తిని తొలుస్తున్న ప్రశ్న, కానీ ఆ ప్రశ్న కి సమాధానం చెప్పేది ఎవ్వరు? అని ఆలోచిస్తున్న తరుణములో తన ప్రశ్నకి తానే సమాధానము వెతుకున్నాడు. అదే హిందువులలో సంఘటన (ఐకమత్యము) లోపించడము. ఈ దేశము నాది ఈ ధర్మము నాది అనే భావన లోపించడము. హిందువులలో స్వార్థచింతన పెరిగి దేశముపట్ల ప్రేమాభిమానాలు సన్నగిల్లడము.
సమాధానము వచ్చినదే తడువు తన ఆలోచనని కార్యరూపము దాల్చే పనిలో నిమగ్నుడై 1925వ సంవత్సరము, విజయదశమి నాడు నాగపూర్ లోని రేషంబాగ్ లో ఒక సంస్థని ప్రారంభించాడు, అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఈ సంస్థ లక్ష్యం హిందూసంఘటన ద్వారా అఖండభారత నిర్మాణము. అలా భగవాధ్వజ ఛాయలలో ఆ సంఘటనా శక్తిని ప్రారంభించిన వాడే మన డా. కేశవరావు బలిరాం హెడ్గేవార్ గారు (డాక్టర్ జీ). అలా ఒక వ్యక్తి ఆనాడు ప్రారంభించిన ఒక మహోన్నత కార్యం నేడు దేశములో పెద్ద వట వృక్షమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దేశానికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ అడుగు ముందుకేస్తుంది. ఎందరో క్రమశిక్షణా వంతులైన వ్యక్తులను తాయారు చేస్తూ, వ్యక్తి మార్పుతోనే దేశప్రగతి సాధ్యము అనే భావన కలిగిన వ్యక్తులని దేశానికి అందిస్తున్నది.
అలా ఆనాడు, ఈనాడు మరి ఏనాడు అయినా ఒక నాయకుడు సన్మార్గములో నడుస్తూ ఒక దేశాన్ని ప్రగతిపథం లోకి తీసుకుని వెళ్ళాలి అంటే ఒక మంచి గురువుయొక్క ఆవశ్యకత ఎంతో ఉంటుంది.
భారతమాతకు జయమగుగాక...
తరిగొప్పుల రాజా రామన్న,అసిస్టెంట్ ప్రొఫెసర్
Comments
Post a Comment