Skip to main content

అనుచిత వ్యాఖ్యలు తగవు!

 అనుచిత వ్యాఖ్యలు తగవు!



ఈరోజు దేశంలో ఏ పౌరుడిని పలకరించినా వారి నోటి నుంచి వచ్చే మాట పహల్గాం ఉగ్రదాడికి భారతదేశం ఇచ్చే జవాబు ఏమిటి? మనం ఏవిధంగా బదులు తీర్చుకోబోతున్నాం అని. దీనికి అనుగుణంగానే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక త్రివిధ దళాలు తమ కార్యాచరణ తాము చేస్తున్నాయి. భారతదేశ పౌరులుగా పూర్తి విశ్వాసముతో ఓపికగా ఎదురు చూడవలసిన సమయం ఇది. ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ఏమరుపాటుతో కూడా  అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రధాని పట్ల, త్రివిధ దళాల పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది.  సామజిక సేవలో (రాజకీయ, స్వచ్చంద సంస్థలు) ఉన్న చాలా మంది కూడా నేడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దేశం మరియు ప్రధాని పట్ల వ్యతిరేకమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఈ వ్యతిరేక వార్తలు కూడా ఒక వ్యూహంతో ప్రజలను అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే చెప్పవచ్చు. మరేమిటి ఆ అసలు సమస్య.? ఒకసారి కొన్ని ఘటనలను గుర్తు చేసుకుందాం..!


బెంగళూరులో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని అవమానిస్తే స్థానిక ముస్లిం మహిళలు దానికి అడ్డుపడడం ఏంటి? అక్కడ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌ను అవమానించిన వారిని అదుపులోకి తీసుకోవడం ఏమిటి?  సర్వ సాధారణముగా దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా తన దేశంపై పరాయివాడు ఉగ్రదాడి జరిపినప్పుడు ఆ దేశం దిష్టిబొమ్మను దహనం చేయడం, వారి జాతీయ పతాకాన్ని అవమానించడం సహజ సిద్ధంగా జరిగే పరిణామాలు. దీనికి ఏ రాష్ట్ర పభుత్వమైనా సహజంగా తమ సంఘీభావాన్ని ప్రకటించాల్సిందే. కానీ మన దేశంలో అలా జరగలేదు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీయులను దేశం విడిచి వెళ్లమనే వరకు కూడా బయటపడని ఇంకొక విషయము, భారతదేశ మహిళ, పాకిస్తాన్ పురుషుడిని వివాహం చేసుకున్నతర్వాత ఆ  మహిళకు, తన పిల్లలకు మాత్రం ఇంకా ఈదేశ పౌరసత్వము వర్తింపచేయడం. వాస్తవంలో ఒక మహిళ ఒక విదేశీయుడిని వివాహము చేసుకున్న తర్వాత ఆ మహిళకు ఆ దేశ పౌరసత్వం రావాలి. తన పిల్లలకు కూడా తన భర్త ఏదేశము వాడు అయితే ఆదేశ పౌరసత్వము ప్రథమ పౌరసత్వము అవుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. భార్యా పిల్లలు భారతీయులు, భర్త మాత్రం పాకిస్తానీ, ఇక ఆ పిల్లలకు ఈదేశం పట్ల అనురాగము, ప్రేమ ఎలా వస్తాయి.? వారు ఏనాటికైనా దేశద్రోహులుకాక మరేమి అవుతారు. ఇదీ పరిస్థితి. 

జరగాలి అని కోరుకోము కానీ, రేపటి రోజున బంగ్లాదేశ్‌తో కూడా వైరి విభేదాలు తలెత్తినప్పుడు, ఆ దేశం వారిని కూడా మన భారతదేశము విడిచి వెళ్ళమని చెప్పే వరకు మనకు తెలియని విషయాలు ఏమిటి అంటే, ఇప్పటికే బంగ్లాదేశ్ పురుషులను వివాహాలు చేసుకుని ఉన్న మహిళలు ఎంతమంది ఉన్నారు? వారి సంతానం ఎంత? దీనికి అదనంగా ఇప్పటికే గుబులు పుట్టించేలా చాపకింద నీరుగా పెరుగుతూ సదావకాశం కోసం కాపుకాచుకుని ఎదురుచూస్తున్న రొహింగ్యాలు. అంటే ఒక దేశముతో వైరి విభేదము వచ్చే వరకు కూడా ఈ దేశములో ఎవరు ఉంటున్నారు, వారు ఏమి చేస్తున్నారు అనే విషయము మనకు తెలిసే పరిస్థితి లేదు. ఒక్క సారి అలంటి సంఘటనలు ఊహించుకుంటేనే మనకు ఎన్నో భిన్నమైన పశ్నలు తలెత్తుతాయి. మరి వీటన్నింటికి సమాధానం ఏమిటి?


కేవలం పాకిస్తాన్ మీద యుద్ధం వీటన్నింటికీ సమాధానం అవుతుందా? పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదాన్ని నిర్ములించినంతనే పని పూర్తి అవుతుందా? ఈ దేశములో ఉంటూ ఈ దేశము గాలి పీలుస్తూ ఈ దేశము యొక్క వినాశనాన్ని కోరుకునే దుష్ట శక్తుల సంగతి ఏమిటి? కన్నతల్లి పాలు త్రాగి ఆ తల్లి రొమ్మునే గుద్దేటటువంటి వారి సంగతి ఏమిటి మరి? మన అందరికీ  బాగా తెలిసిన సామెత ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని, కాబట్టి ఈ రోజు భారతదేశానికి రచ్చ గెలవడం నల్లేరుపై నడకంత సులభము కానీ ఇంటిలోపల ఉన్న దుష్టశక్తుల భరతం పట్టాలి అంటే ఎలా? దీనికి ఉన్న ఏకైక మార్గం హిందువులు అంతా ఏకతాటిపైకి వచ్చి స్వలాభేక్ష లేకుండా కుల - మత, ఉచ్చ - నీచ బేధాలు లేకుండా నిస్వార్థముతో దేశ సమగ్రతకు పని చేసే నాయకులను ఎన్నుకోవడం,  అలా ఎన్నుకోబడిన నాయకులు దేశ సమగ్రత కోసం ఏరకమైన నిర్ణయం తీసుకున్నా కొద్దిగా కూడా మనసులో అనుమానము లేకుండా వారిపట్ల సంపూర్ణ విశ్వాసముతో అండగా నిలబడితే భవ్యమైన భారత దేశ నిర్మాణము గావించి తిరిగి మన భారతదేశాన్ని విశ్వగురువుగా చూడగలుగుతాము. 


                                                                                                                          

                                                                                                                           రాజారామన్న తరిగొప్పుల





Comments

Post a Comment

Popular posts from this blog

గాలి మేడలు

         నేను సివిల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ..బోలెడన్ని కలలు కనేవాడిని. నా టాలెంట్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందని...లక్ష జీతం...బంగ్లా...కారు ఇస్తారు అన్నవి ఆ కలలు.         అయితే డిగ్రీ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వాస్తవాలు తెలియడం మొదలు అయింది.       ఎక్కడికి వెళ్ళినా పది..పన్నెండు వేలు జీతం ఇస్తామన్న వారేగాని..నా టాలెంట్ కి తగ్గ జీతం ఇచ్చే వాళ్లు తారసపడలేదు.       కూలీ పనులు చేసేవారికి కూడా రోజుకు కనీసం అయిదు వందలు ఇస్తున్నారు.అంటే నెలకు పదిహేను వేలు.అటువంటిది ఒక ఇంజినీర్ కి పది వేల జీతం నాకు అవమానకరంగా అనిపించింది.        అందుకే కనీసం యాభై వేలు ఇవ్వనిదే ఉద్యోగంలో చేర రాదని నిర్ణయం తీసుకున్నాను.         అలా రెండేళ్లుగడిచిపోయాయి.ఇప్పుడు ఇంటర్ వ్యూ కి వెళ్తే రెండేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నావని అడుగుతూ రిజెక్ట్ చేయసాగారు.           ఇప్పుడు నేను పాతిక వేల జీతానికి సిద్ధపడ్డాను. అయితే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు కూడా గగనమయ్యారు. ...

సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు

 సమాజహితం కోరేవాడు కొంచెం కఠినంగా మాట్లాడవచ్చు. అంతమాత్రాన పోయేదేం లేదు. కఠినంగా చెప్పినా అది మన మంచికోసమే అయినప్పుడు అందులో తప్పు ఎంచవలసిన పనిలేదు. ఈ విషయాన్ని ఒక చక్కని పోలికతో చెప్పాడు వేమన ఈ పద్యంలో.  వేమన తాను చెప్పదలచిన విషయాన్ని ముందు చెప్పి అతి చక్కని సాదృశ్యంతో దాన్ని సమర్థిస్తాడు. అది వేమన పద్యాలలో కనిపించే ప్రత్యేకత ఈ పద్యంలో చూడండి. చాకివాడు కోక చీకాకు పడజేసి మైలబుచ్చి మంచి మడుపు జేయు బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినురవేమ. పూర్వకాలంలో మైల బట్టలు ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు తీసుకుపోయి వాటిని  పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి ఇచ్చేవారు చాకలివారు.    చాకివాడు                  =       వస్త్రాన్ని చీకాకు పడజేసి           =     బాగా బండకేసి బాది రక రకాలుగా మెలితిప్పి చికాకు      ...